వాయనాడ్‌ బాధితుల కోసం 100 ఇళ్లను నిర్మించనున్న కథోలిక పీఠాధిపతులు

వాయనాడ్‌ బాధితుల కోసం 100 ఇళ్లను నిర్మించనున్న కథోలిక పీఠాధిపతులు

భారతదేశంలోని దక్షిణ కేరళ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కొండచరియలు విరిగిపడిన బాధితుల కోసం కథోలిక పీఠాధిపతులు  100 ఇళ్లను నిర్మించనున్నారు .

వాయనాడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇళ్లను నిర్మిస్తామని కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ (KCBC) ఆగస్టు 6న ఒక ప్రకటనలో ప్రకటించింది.

కేరళ ప్రధాన కార్యాలయం ఉన్న సైరో-మలబార్, సైరో-మలంకార మరియు లాటిన్ రైట్ సభలకు చెందిన  ప్రాంతీయ బిషప్‌ల సంఘం, పునరావాసం పొందిన వారికి గృహాలను నిర్మించిన తర్వాత గృహోపకరణాలను కూడా సరఫరా చేస్తామని చెప్పారు.

ప్రస్తుతం కేరళ  రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన స్థలాల్లోనే ఇళ్లను నిర్మిస్తామని పీఠాధిపతులు (బిషప్‌లు) ప్రకటనలో తెలిపారు."లబ్దిదారులు సర్వస్వం కోల్పోయినందున పీఠాధిపతులు  ఫర్నిచర్ మరియు ఇతర గృహోపకరణాలను ఏర్పాటు చేస్తారు" అని KCBC ప్రతినిధి ఫాదర్ జాకబ్ జి పాలక్కప్పిల్లి అన్నారు.

వివిధ దేవాలయాలకులకు చెందిన అనేక బృందాలు జిల్లాలోని అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయక శిబిరాల్లో క్షతగాత్రులను కాపాడుతున్నాయని గురుశ్రీ జాకబ్ గారు తెలిపారు.

సెయింట్ జోసెఫ్ దేవాలయం వారు  ఒక సహాయ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.  విచారణ గురువు గురుశ్రీ  అబ్రహం మాట్లాడుతూ "సర్వాన్ని కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు ఇళ్ళు నిర్మించడం" తక్షణ అవసరం అని అన్నారు.

 కేరళలో అత్యంత ఎత్తైన కొండలు వయనాడ్ జిల్లాలోనే ఉన్నాయి. ఈ వయనాడ్ ప్రాంతం ఆకుపచ్చని అందమైన టీ తోటలు, కొండలతో దోబూచులాడే మేఘాలు, పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

జూలై 30 తెల్లవారుజామున ఈ ప్రాంతంలో  వరుస కొండచరియలు విరిగిపడ్డాయి. ఇది మూడు గ్రామాలను సైతం నాశనం చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సహాయ బృందాలు, పోలీసులు, సైన్యం,బండరాళ్లను తొలగిస్తోన్న ప్రొక్లెయినర్ల మాత్రమే కనిపిస్తున్నాయి.

ఈ విషాదంలో 222 మంది చనిపోయినట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రముఖ మీడియా సంస్థలూ ఈ సంఖ్య 400 పైనే ఉంటుందని చెబుతున్నాయి. 200 మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer

 

Telugu Survey Popup Image