బొబ్బిలిలో బాల యేసు స్వరూపం ధ్వంసం
ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని గొల్ల వీధి వద్ద ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చి (RCM) ప్రాంగణంలో బాల యేసు స్వరూపాన్ని దుండగులు ధ్వంసం చేసారు.దీనిపై స్థానిక విశ్వాసులు, బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బొబ్బిలిలో బాల యేసు స్వరూపం ధ్వంసం
ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని గొల్ల వీధి వద్ద ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చి (RCM) ప్రాంగణంలో బాల యేసు స్వరూపాన్ని దుండగులు ధ్వంసం చేసారు.దీనిపై స్థానిక విశ్వాసులు, బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం, మూడు రోజుల క్రితం ఇదే ప్రాంగణంలో ఉన్న దేవాలయ హుండీని కూడా గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా బాల యేసు స్వరూపం ధ్వంసం కావడంతో, వరుస ఘటనలపై స్థానిక విశ్వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.
ఈ ఘటనపై శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Artile and Design By M Kranthi Swaroop
