మదర్ థెరిసా: మన కాలానికి చెందిన ఒక పుణ్యాత్మురాలు
మదర్ థెరిసా: మన కాలానికి చెందిన ఒక పుణ్యాత్మురాలు
ఈ రోజుల్లో ప్రపంచం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఒంటరితనం, పేదరికం, అనారోగ్యం, వృద్ధాప్యం, నిరాశ్రయత్వం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి.
అందుకే మదర్ థెరిసా సందేశం ఇప్పటికీ మనకు అవసరమే.
"మదర్ థెరిసా" పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది పేదలు, అనాథలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, నిరాశ్రయులు, సమాజం పక్కన పెట్టినవారి పట్ల ప్రేమతో చేసిన ఆమె చేసిన సేవ.
పునీత మదర్ థెరిసా గారు ఆమె భారతదేశానికి వచ్చి, ముఖ్యంగా కోల్కతాలోని పేదల మధ్య తన జీవితాన్ని అంకితం చేసింది.మదర్ థెరిసా జీవితానికి కేంద్రబిందువు మన ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసం.పేదల సేవను ఆమె కేవలం సామాజిక సేవగా చూడలేదు. బాధపడుతున్న ప్రతి మనిషిలో క్రీస్తును చూసింది.
సేవ చేయడానికి మన దగ్గర ఎంతో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు.
మన దగ్గర ప్రేమ ఉంటే చాలు అని నిరూపించారు పునీత మదర్ థెరిసా గారు.
ఒక చిరునవ్వు, ఒక మంచి మాట, ఒక చేయూత, ఆకలితో ఉన్నవారికి ఒక భోజనం, ఒంటరిగా ఉన్నవారికి కొంత సమయం ఇవన్నీ కూడా ప్రేమకు రూపాలే.
1979లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సేవకు ఇది ఒక గొప్ప గుర్తింపు. మదర్ థెరిసాను సెయింట్గా 2016 సెప్టెంబర్ 4న అధికారికంగా ప్రకటించారు. మదర్ థెరిసా 1997 సెప్టెంబర్ 5న మరణించారు. కానీ ఆమె ప్రారంభించిన సేవ ఆగిపోలేదు. Missionaries of Charity ద్వారా ఆమె సేవా వారసత్వం కొనసాగుతోంది.
Article and design by M Kranthi Swaroop
