ప్రతి జీవి పరస్పర ప్రేమకు పిలువబడింది అని త్రిత్వం బోధిస్తుంది - పొప్ లియో

ప్రతి జీవి పరస్పర ప్రేమకు పిలువబడింది అని త్రిత్వం బోధిస్తుంది - పొప్ లియో

యుద్ధంతో నాశనమైన దేశాల కోసం శ్రీసభ నెల రోజుల పాటు చేసిన మరియా మాత ప్రార్థన విజ్ఞప్తిని ముగిస్తున్న తరుణంలో, ఆదివారం నాటి ఏంజెలస్ ప్రార్థనలో పరిశుద్ధ లియో XIV పాపు గారు "న్యాయమైన మరియు శాశ్వతమైన శాంతి" కోసం ప్రార్థించారు.

ఈ సందర్భముగా పవిత్ర త్రిత్వ రహస్యం ప్రతి జీవి పరస్పర సహవాసం కోసం సృష్టించబడిందని బోధిస్తుందని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు. విభజనలు, విభేదాలు, మరియు పరస్పర ద్వేషం ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తాయని ఆయన హెచ్చరించారు.

మే 31న, అత్యంత పవిత్రమైన త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ రోజున, ఏంజెలస్ ప్రార్థనకు ముందు ప్రసంగిస్తూ , పరిశుద్ధ లియో XIV పాపు గారు యోహాను సువార్తలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు నికోదేముతో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ, పవిత్ర త్రిత్వ పండుగ దేవుడు ప్రేమతో కూడిన సహవాసమని, ఆ ప్రేమలోకి మానవాళిని ఆహ్వానిస్తున్నాడని చెప్పారు.

"ప్రతి ఒక్కరినీ, ప్రతి సృష్టిని ప్రేమించేందుకు పవిత్ర త్రిత్వం మనకు ప్రేరణ ఇస్తుంది. ప్రతి జీవి పరస్పర సహవాసం, సంబంధం మరియు ఐక్యత కోసం సృష్టించబడిందని అది మనకు బోధిస్తుంది," అని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.

పరిశుద్ధాత్మ, “తండ్రిని మరియు కుమారుడిని ఏకం చేస్తుంది” మరియు “మన హృదయాలలో కుమ్మరించబడింది” అని ఆయన అన్నారు.

ఈ సందర్భముగా పరిశుద్ధ లియో XIV పాపు గారు అనారోగ్యంతో ఉన్నవారికి మరియు వారిని చూసుకునే వారికి తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు.రోగులకు, వారిని సంరక్షించే వారికి నా ప్రార్థనలు మరియు ఆధ్యాత్మిక సాన్నిధ్యాన్ని అందిస్తున్నాను. అలాగే ప్రేమ, శ్రద్ధ, సంఘీభావాన్ని పెంపొందించే వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాను," అని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.

 

Article and design by M Kranthi Swaroop