మయన్మార్ గ్రామాలపై వైమానిక దాడిలో మైనర్లతో సహా 17 మంది పౌరులు మరణించారు

మయన్మార్ గ్రామాలపై వైమానిక దాడిలో మైనర్లతో సహా 17 మంది పౌరులు మరణించారు

జనవరి 7, 2024న మయన్మార్  గ్రామాలలోని దేవాలయాల పై జరిపిన వైమానిక దాడిలో మైనర్లతో సహా 17 మంది పౌరులు మరణించారు మరియు 30 మందికి పైగా గాయపడ్డారు. వారిపై దాడి చేసింది తామేనని మయన్మార్‌ పాలకుడు జుంటా (Junta) ధృవీకరించారు.

భారత సరిహద్దు సమీపంలోని కనన్ పట్టణంలో ఉదయం 9:55 గంటలకు  ఈ సంఘటన జరిగింది. వైమానిక దాడిలో పాఠశాల మరియు క్రైస్తవ దేవాలయం తో పాటు పదికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి మరియు  ప్రాణనష్టం జరిగింది.గ్రామంలోని రెండు చర్చిలపై తొలి బాంబులు పడ్డాయని, భవనాల నుంచి ప్రజలు పారిపోవడంతో రెండో దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఈ గ్రామం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) సమూహం ఆధీనంలో ఉంది.

గత ఏడాది ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైనిక కుట్ర అనంతరం ఈ పోరాటం మరింత ముదిరింది.ఆ కుట్రను ప్రతిఘటిస్తూ మయన్మార్‌లో ఏర్పాటైన ఇతర సాయుధ బృందాలకు కచ్చిన్ తిరుగుబాటుదారులు మద్దతు ఇస్తుండటంతో ఈ దాడి చేసింది .

 

 

Telugu Survey Popup Image