అణుశక్తి వినియోగం శాంతి సేవకే ఉపయోగపడాలన్న పోప్

ఏప్రిల్ 26న, సెయింట్ పీటర్స్ వద్ద జరిగే వారపు రెజీనా కేలీ ప్రార్థనలో, చెర్నోబిల్ విపత్తు జరిగి 40 సంవత్సరాలు పూర్తయ్యాయని పోప్ అన్నారు.

ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించాలని  పోప్ లియో విజ్ఞప్తి చేశారు.

నిర్ణయాలు తీసుకునే  అన్ని స్థాయిల వారు , విచక్షణ మరియు బాధ్యత ఎల్లప్పుడూ ప్రబలంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను, తద్వారా అణుశక్తి యొక్క ప్రతి వినియోగం జీవితానికి మరియు శాంతికి సేవ చేయాలి అని పోప్ అన్నారు .

ఆనాటి సువార్తపై ప్రసంగిస్తూ, మానవ జీవితం మరియు గౌరవాన్ని పణంగా పెట్టి, నేటికీ కొందరు సహజ వనరులను దోచుకుంటున్నారని పోప్ విచారం వ్యక్తం చేశారు.

భూమి వనరులను దోచుకోవడం ద్వారా, రక్తపాత యుద్ధాలకు పాల్పడటం ద్వారా లేదా ఏ రూపంలోనైనా దుష్టత్వాన్ని పెంపొందించడం ద్వారా—మనందరి నుండి శాంతి, ప్రశాంతతలతో కూడిన భవిష్యత్తు అవకాశాన్ని దొంగిలించడం జరుగుతుంది