విద్య ప్రతి ఒక్కరికి ఆశాజ్యోతి - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు


విద్య ప్రతి ఒక్కరికి ఆశాజ్యోతి  - పరిశుద్ధ  ఫ్రాన్సిస్ పాపు గారు

ఈ నూతన సంవత్సరంలో తనతో కలిసి ప్రార్థించాలని పరిశుద్ధ  ఫ్రాన్సిస్ పాపు గారు  ప్రపంచవ్యాప్తంగా ఉన్న కతోలికలను కోరారు. ముఖ్యంగా  "వలసదారులు మరియు శరణార్థులు" విద్యను పొందేందుకు  మరియు వారి మెరుగైన భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేయాలని కోరారు.

పరిశుద్ధ  ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ "వలసదారులు, శరణార్థులు మరియు యుద్ధంలో ప్రభావితమైన వారి కోసం ప్రార్థిద్దాం, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి అవసరమైన విద్యపై వారి హక్కు ఎల్లప్పుడూ గౌరవించబడాలి" అని అన్నారు.  ఇది నూతన సంవత్సర ప్రారంభం కోసం పరిశుద్ధ  ఫ్రాన్సిస్ పాపు గారు ఎంచుకున్న ప్రార్థన ఉద్దేశ్యం.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి  ప్రతి నెల ప్రార్థన విన్నపాలపై  చిన్న వీడియో ప్రతిబింబాన్ని రికార్డ్ చేస్తారు మరియు ఈ సంవత్సరం అతని మొదటి వీడియో జనవరి 2న విడుదలైంది.

యుద్ధం, వలసలు లేదా పేదరికం కారణంగా, "సుమారు 250 మిలియన్ల మంది బాలబాలికలకు విద్య లేదు అని , ఇమ్మిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా పిల్లలు మరియు యువకులందరికీ పాఠశాలకు వెళ్ళే హక్కు ఉంది" అని, విద్య ప్రతి ఒక్కరికి ఆశాజ్యోతి అని ఈ సందర్భముగా పరిశుద్ధ  ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పారు.

చాలా మంది మైనర్లు దోపిడీకి గురవుతున్నారు అని, విద్య హక్కు వలసదారులకు మరియు సమాజానికి మంచిదని పరిశుద్ధ  ఫ్రాన్సిస్ పాపు గారు  అన్నారు. ఇది వలసదారులు మరియు శరణార్థులను వివక్ష, నేర నెట్‌వర్క్‌లు మరియు దోపిడీ నుండి రక్షించగలదు అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 128 మిలియన్ల మంది అబ్బాయిలు మరియు 122 మిలియన్ల మంది బాలికలు పాఠశాలకు హాజరు కావడం లేదని పాపు గారి  వరల్డ్‌వైడ్ ప్రేయర్ నెట్‌వర్క్ తెలిపింది. విద్యను పొందకపోవడానికి గల ప్రాథమిక కారణాలు "పేదరికం, భౌగోళిక స్థానం, వలస స్థితి, లింగం, భాష, వైకల్యం మరియు జాతి" అని వారు పేర్కొన్నారు.

విద్యను పొందని వలస మరియు శరణార్థి పిల్లలు పేదరికం మరియు అసమానతలు, సామాజిక అట్టడుగున మరియు దోపిడీని ఎదుర్కొంటున్నారని వరల్డ్‌వైడ్ ప్రేయర్ నెట్‌వర్క్ తెలిపింది.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer

Telugu Survey Popup Image