శ్రీసభకి క్రీస్తు సువార్త ప్రకటించాలనే అపరిమితమైన కోరిక ఉన్న పునీతులు అవసరం : పోప్ ఫ్రాన్సిస్

శ్రీసభకి క్రీస్తు  సువార్త ప్రకటించాలనే అపరిమితమైన కోరిక ఉన్న పునీతులు  అవసరం : పోప్ ఫ్రాన్సిస్


 పోప్ ఫ్రాన్సిస్ గారు ఇటాలియన్ "బేరర్స్ ఆఫ్ సెయింట్ రోజ్" సోడాలిటీ సభ్యులతో సమావేశమయ్యారు.క్రీస్తు సువార్తను వ్యాప్తి చేయడానికి కృషి చేయమని వారిని ప్రోత్సహిస్తారు.  పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ "మనకు ఈనాటికీ పరిశుద్ధులు కావాలి అని, ప్రభు యేసుని మార్గంలో నడుస్తూ, దేవుని ఆజ్ఞానుసారం  నీతి నిజాయితీలతో నిస్వార్థమైన సేవచేసే వారు కావాలి అని అన్నారు .

సెంట్రల్ ఇటాలియన్ నగరమైన విటెర్బోలో, సెయింట్ రోజ్ ఆఫ్ విటెర్బోకి అంకితం చేయబడిన ఇటాలియన్ సోడాలిటీ 1978లో స్థాపించబడింది.

మీ చరిత్ర యొక్క మూలాలు మమ్మల్ని సెయింట్ విటెర్బోలో నివసించిన రోజులకు తీసుకువెళతాయి, అక్కడ సెయింట్ రోజ్ కు  ఒక ఆధ్యాత్మిక అనుభవం ఉంది, అది  మొత్తం నగరానికి భక్తి మరియు క్రైస్తవ శక్తిని ప్రోత్సహించేదిగా ఆమె చేసింది" అని  పోప్ ఫ్రాన్సిస్ గారు పేర్కొన్నారు.

పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ రోజ్ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, సెయింట్ రోజ్ (1233-1251) చాలా చిన్న వయస్సులోనే సంపూర్ణ పేదరికంలో జీవించడానికి మరియు దాతృత్వానికి అంకితమయ్యారని చెప్పారు.

ఆమె అప్పటి పాపల్ స్టేట్స్‌లో భాగమైన విటెర్బోలోని చాలా మంది ప్రజలకు  ప్రభు యేసుని   ప్రేమను, కృపను తన క్రియలబట్టి చూపించారు అని , ఆమె పరిశుద్ధాత్మచే కదిలించబడింది అని పొప్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు.

చివరిగా ఆధ్యాత్మిక వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి  "బేరర్స్ ఆఫ్ సెయింట్. రోజ్" సోడాలిటీని పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రోత్సహిస్తూ మీరు చేస్తున్న పనులకు ధన్యవాదాలు, మరియు ప్రజల జీవితాలలో, ముఖ్యంగా అత్యంత అవసరమైన వారి జీవితాల్లో మీరు ప్రత్యక్షంగా నిర్వహించే అనేక సహాయ, సాంస్కృతిక మరియు నైతిక కార్యకలాపాలకు ఎంతో విలువైనవి  అని అన్నారు.  

 

Article By
M Kranthi Swaroop
RVA Telugu Online Producer

Telugu Survey Popup Image