యునైటెడ్ స్టేట్స్‌లోని బైజాంటైన్ కతోలికులకు సందేశాన్నిపంపిన పోప్ లియో

యునైటెడ్ స్టేట్స్‌, పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లోని Byzantine Catholic Archeparchy మెట్రోపాలిటన్ అసెంబ్లీలో పాల్గొన్నవారికి పోప్ లియో ఒక సందేశాన్ని పంపారు.

మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ William Skurla మరియు Council of Hierarchs సమావేశమైన ఈ సమావేశం జూలై 16-20 వరకు ఇండియానాలోని వైటింగ్‌లోని బైజాంటైన్ చర్చి ఆఫ్ సెయింట్ మేరీలో జరుగుతోంది.

“పిట్స్‌బర్గ్ మెట్రోపాలిటన్ చర్చి అంతటా ఉన్న మతాధికారులు మరియు సామాన్యులను ఒకచోట చేర్చి, ఐక్యత, ఆధ్యాత్మిక పునరుద్ధరణకు మూలస్తంభంగా” పనిచేయడం అసెంబ్లీ లక్ష్యం.

ఉత్తర అమెరికా అంతటా బైజాంటైన్ కమ్యూనిటీలను స్థాపించిన అసెంబ్లీ పూర్వీకులకు  పోప్ కృతజ్ఞతలు తెలిపారు. 

పోప్ లియో యునైటెడ్ స్టేట్స్‌లోని బైజాంటైన్ సమాజానికి తన ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని వివరిస్తూ తన సందేశాన్ని ముగించారు. 

Telugu Survey Popup Image